Chitram news
Newspaper Banner
Date of Publish : 04 April 2026, 6:01 pm Editor : Chitram news

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి మీసేవ ఆపరేటర్ల పాలాభిషేకం

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: తమకు కమీషన్ పెంచడంపై మీసేవ ఆపరేటర్లు హర్షం వ్యక్తం చేస్తు ఎన్టీఆర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి శనివారం పాలాభిషేకం చేశారు.. ఈ సందర్బంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.కమీషన్ పెంపుతో పాటు కొత్త ఛార్ట్ అమలు చేస్తున్నామని ఏఎంసీవోఏ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల శ్రీనివాస్, టీఎంవోఏ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ లు అన్నారు. కమీషన్ పెంపుతో పాటు కొత్త సిటిజన్ ఛార్టర్ను ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. జిల్లాలోని మీసేవ ఆపరేటర్లకు సంబంధించిన రెండు యూనియన్లు టీఎంవోసీఏ, ఏఎంసీవోఏ 2025లో జేఏసీగా ఏర్పడ్డాయన్నారు. పదేళ్లుగా తమకు కమీషన్ పెంచాలని ప్రభుత్వాన్ని వేడుకుంటే పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా కమిషన్ పెంపునకు సహకరించిన సీఎం రేవంత్రెడ్డికి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, మీసేవ కమిషనర్ రవి కిరణకు జిల్లా యూనియన్ల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పెరిగిన కమిషన్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందన్నారు.ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పెద్దోళ్ల కిషోర్, ధర్మానందం, జీవీఆర్, శివకుమార్, విశ్వనాథ్, సంతోష్, మహమ్మద్ నజీర్ అహ్మద్, సయ్యద్ ఉబేద్ హైమద్, చింత రాజు, పెద్దోళ్ల రమేశ్వర్, తిరుపతి, శివకుమార్, పల్లికొండ అనిల్ తదితరులు పాల్గొన్నారు.