తెలంగాణను దక్షిణాసియాలో టెక్స్టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి
ATEXCON-2026 సదస్సులో పెట్టుబడిదారులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు చిత్రం న్యూస్, హైదరాబాద్: వస్త్ర పరిశ్రమ రంగంలో తెలంగాణను 2047 నాటికి దక్షిణాసియాలోనే అగ్రగామి టెక్స్టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. టెక్స్టైల్ రంగ అభివృద్ధికి ప్రభుత్వం రూపొందించిన విజన్కు అనుగుణంగా ప్రపంచాన్ని మార్చగల వాతావరణాన్ని కల్పించేందుకు పారిశ్రామిక వేత్తలు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ (CITI) సంయుక్తంగా నిర్వహించిన 13వ ఏషియా...