* రూ.5లక్షల ఎల్.ఓ.సి లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతిరెడ్డి
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిరుపేదలకు అత్యవసర సమయంలో కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని నిజమాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం గ్రామానికి చెందిన పాముల లలిత అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. శస్త్రచికిత్స నిమిత్తం రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు సూచించారు. దీంతో రూ.5లక్షలకు సంబంధించి ఎల్.ఓ.సి లెటర్ ను బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మేల్యే తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అందజేశారు.ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.


