అటవీ అధికారులకు తాబేలును అప్పగించిన రైతు వెంకటేశ్వర రావు
చిత్రం న్యూస్, పెనుబల్లి : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామానికి చెందిన రైతు తగరం వెంకటేశ్వరరావు తన పొలంలో పనిచేస్తుండగా ఒక అరుదైన తాబేలు కనిపించింది. సాధారణంగా ఈ తాబేలు ప్రత్యేక లక్షణాలతో ఉండటంతో ఆయన దానిని జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చారు. అనంతరం ఆ తాబేలు గురించి సంబంధిత అటవీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అటవీ శాఖ అధికారులు గ్రామానికి చేరుకుని తాబేలును స్వాధీనం చేసుకున్నారు. ప్రకృతి సంపదను కాపాడే బాధ్యతతో...