-Advertisement-

గోదావరి పుష్కరాల ఘాట్లను సందర్శించిన పోలీస్ కమిషనర్ సాయి  చైతన్య

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని తుంగిని గ్రామం వద్ద గల పుష్కర ఘాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య,శుక్రవారంసందర్శించారు.2027 సంవత్సర కాలంలో రాబోయే గోదారి పుష్కరాలను ఉద్దేశించి పుష్కర ఘాట్ల ఏర్పాట్లు , మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, పుష్కర ఘాటుకు వచ్చే పోయే  దారులు, పార్కింగ్ ప్రదేశాలు పరిశీలించారు. నీళ్లలో ఎవరు కూడా మునిగి ప్రాణ నష్టం జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటులను చేయాలని అధికారులకు సూచించారు గ్రామస్తులతో మాట్లాడి గత పుష్కరాల్లో ఏమేం లోటుపాట్లు ఉన్నాయి అడిగి తెలుసుకున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి పార్కింగ్ సమస్యలు, ఇతర అవరోధాలు కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, నవీపేట్ ఎస్ ఐ శ్రీకాంత్, తుంగిని సర్పంచ్ శ్రీకాంతారావ్, ఉపసర్పంచ్ భూమేష్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments