-Advertisement-

కమీషన్ పెంపుపై మీసేవ ఆపరేటర్ల హర్షం

చిత్రం న్యూస్, నిజామాబాద్: మీ సేవ ఆపరేటర్లకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది.కమీషన్ పెంపుతో పాటు కొత్త సిటిజన్ చార్టర్‌ను అమల్లోకి తీసుకొచ్చింది.ఈ మేరకు జిల్లా మీ సేవ యూనియన్ల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.నిజామాబాద్ జిల్లాలోని మీ సేవ ఆపరేటర్లకు సంబంధించిన రెండు యూనియన్లు టీఎంఓసిఏ, ఏఎంసిఓఏ గత సంవత్సరం 2025 లో జేఏసీగా ఏర్పడ్డాయి.గత పది సంవత్సరాలుగా జిల్లా యూనియన్ సభ్యులు కలిసి కమీషన్ పెంపు కోసం కమిషనర్, ఐటీ సెక్రటరీ, ప్రభుత్వానికి పలు మార్లు విన్నవించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను గుర్తించి,మీ సేవ సేవలపై కమీషన్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.ఈ సందర్భంగా  పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, మీ సేవ కమిషనర్ రవి కిరణ్‌లకు జిల్లా యూనియన్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.పెరిగిన కమీషన్  ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. అదే రోజు నుంచి కొత్త సిటిజన్ చార్టర్ కూడా అమలులోకి వచ్చింది.ఏప్రిల్ 3 రాత్రి 8 గంటల నుంచి ఏప్రిల్ 5 ఉదయం 8 గంటల వరకు సాంకేతిక కారణాల వల్ల సేవల్లో అంతరాయం ఉంటుందని ప్రజలు గమనించి సహకరించాలని యూనియన్ నాయకులు కోరారు.  ప్రభుత్వం మా సమస్యలను గుర్తించి కమీషన్ పెంచడం సంతోషకరం. భవిష్యత్తులో కూడా మా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మీ సేవ  ఏఎంసిఓఏ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల శ్రీనివాస్, టి ఎంఓఏ జిల్లా అధ్యక్షుడు కే లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులుపెద్దోళ్ళ కిషోర్, ధర్మానందం, జివిఆర్, శివకుమార్,విశ్వనాథ్, సంతోష్, మహమ్మద్ నజీర్ అహ్మద్, సయ్యద్ ఉబేద్ హైమద్, చింత రాజు, పెద్దోళ్ల రమేశ్వర్, తిరుపతి, పి.శివకుమార్, పల్లికొండ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments