-Advertisement-

ఘనంగా దొడ్డి కొమరయ్య జయంతి ఉత్సవాలు

చిత్రం న్యూస్, ఖమ్మం: దొడ్డి కొమరయ్య జయంతి ఉత్సవాలను ఖమ్మం లో ఘనంగా నిర్వహించారు. ట్యాంక్ బండ్ పై ఉన్న విగ్రహానికి బహుజన జేఏసీ బీసీ సంఘాలు, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సంఘాల ప్రతినిధులు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలవేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు డా. కొరిపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొమరయ్య తెలంగాణ రైతాంగ పోరాటంలో విరోచిత పోరాటం చేసి భూమి, భుక్తి, జాతి విముక్తి కోసం పోరాడి అమరుడైన తొలి తెలంగాణ అమరుడు దొడ్డి కొమురయ్య అన్నారు. వారి ఆశయాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం పెద్దలు కూరాకుల నాగభూషణం యాదవ్ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు పెరుగు వెంకటరమణ యాదవ్, కత్తి నెహ్రూ గౌడ్, కుర్మ గొల్ల అధ్యక్షులు మల్లేశం యాదవ్, రాజ్యాంగ పరిరక్షణ స మితి వ్యవస్థాపకులు సాదిక్ అలీ, సావిత్రిబాయి పూలే ఐడియాలజీ సొసైటీ వ్యవస్థాపకులు పెళ్లూరి విజయకుమార్, లంబాడ హక్కుల పోరాట సమితి సేవాలాల్ సేన అధ్యక్షులు శోభన్ నాయక్, కోడి లింగయ్య యాదవ్ నరసింహారావు, మధు, తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments