-Advertisement-

భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే ఆరాధనలు

చిత్రం న్యూస్, దండేపల్లి: దండేపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలోని CSI వెస్లీ చర్చి వెంకటాపూర్ తో పాటుగా ఇతర చర్చిలలో గుడ్ ఫ్రైడే సందర్భంగా గుడ్ ఫ్రైడే ఆరాధనలు ఘనంగా నిర్వహించారు. యేసు క్రీస్తు శిలువ త్యాగాన్ని స్మరించుకుంటూ ఉదయం నుంచే విశ్వాసులు చర్చిలకు చేరుకొని ప్రార్థనలు, కీర్తనలు చేశారు. శిలువ మార్గం ఆచరణతో పాటు ఉపవాస దీక్షలు పాటిస్తూ భక్తులు ఆధ్యాత్మికంగా నిమగ్నమయ్యారు.

ఈ ఆరాధనలో Rev. S. వరప్రసాద రావు దైవ సందేశం అందించారు. క్రీస్తు శిలువపై చేసిన త్యాగం మనుషుల పాపక్షమకు మార్గమని, ప్రేమ, క్షమ, త్యాగం జీవన విధానంగా తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సహనం, పరస్పర గౌరవం పెంపొందించాలని పిలుపునిచ్చారు. మధ్యాహ్నం ప్రత్యేక ప్రార్థనలో క్రీస్తు శిలువపై చివరి ఏడు మాటలపై బోధనలు నిర్వహించారు. విశ్వాసులు నిశ్శబ్దంగా ప్రార్థనలు చేస్తూ భక్తి భావాన్ని వ్యక్తం చేశారు.

✖ Close హోం
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments