Chitram news
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 3:32 pm Editor : Chitram news

బాసర ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

చిత్రం న్యూస్, బాసర: రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పర్యటన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర ఆలయానికి రానున్న నేపథ్యంలో, అక్కడ చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ఆలయంలో నిర్వహించనున్న పూజా కార్యక్రమాలు, శంకుస్థాపన జరిగే ప్రాంతాలను సందర్శించి, అధికారులకు పలు సూచనలు అందించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈవో విజయరామారావు, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తితో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.