Chitram news
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 3:08 pm Editor : Chitram news

బాసర అమ్మవారిని దర్శించుకున్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

చిత్రం న్యూస్, బాసర : తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు, నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శుక్రవారం బాసర అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు, అర్చకులు సంప్రదాయ పూర్వకంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సుదర్శన్ రెడ్డి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆలయ అధికారులతో ఆయన మాట్లాడారు. మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.