డీసీసీ కార్యదర్శి ప్రణితకు ఘనంగా సన్మానం
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీలో డీసీసీ కార్యదర్శిగా నియమితులైన నార్నూర్ వాసి బానోత్ ప్రణిత సూరజ్కు లంబాడా జేఏసీ జిల్లా నాయకులు ఆత్మరాం బానోత్ సన్మానం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందించి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆత్మరాం బానోత్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో...