అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు: నిర్మల్, భైంసా ఇంఛార్జి ఏఎస్పీ సాయి కిరణ్
చిత్రం న్యూస్, బాసర: వ్యక్తుల మధ్య జరిగే చిన్నపాటి గొడవలు, చిల్లర తగాదాలు, సాధారణ రోడ్డు ప్రమాదాలు వంటి ఘటనలకు కావాలని కొంత మంది ఆకతాయిలు మత రంగు పూసే ప్రయత్నం చేస్తున్నారు.ఇటువంటి చర్యలు ప్రజల మధ్య అనవసరమైన ఉద్రిక్తతలు, విద్వేషాలను సృష్టించ డానికి ప్రయత్నిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని నిర్మల్, భైంసా ఇంఛార్జి ఏఎస్పీ సాయి కిరణ్ అన్నారు. సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేయడం, సంఘటనలను వక్రీకరించి మతపరమైన కోణంలో చూపించడం...