బాసర అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు
చిత్రం న్యూస్, బాసర: దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి శుక్రవారం పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. హనుమాన్ జయంతి ఉత్సవాలు సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో అక్షర శ్రీకార పూజలను చేశారు. అమ్మవారి దర్శనం కోసం ఉమ్మడిఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి రైలు,...