Chitram news
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 9:08 pm Editor : Chitram news

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని కలిసిన ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్P

చిత్రం న్యూస్, బాసరనిర్మల్ జిల్లా :బాసరనుండి బిద్రేల్లి వరకు దేగాం నుండి భైంసా వరకు జాతీయ రహదారికి ఫోర్ (4)లైన్ మార్గం ఏర్పాటు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరికి ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ విన్నవించారు. ఎంపీ నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి బుధవారం దిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. బాసర నుండి భైంసా వరకు రహదారిపై ప్రమాద స్థలాలను గుర్తించి, ప్రమాదాలు జరుగకుండా 4 లైన్ ఏర్పాటు చేయాలని కోరారు. అదే విధంగా బాసర గోదావరి నది ఉన్న బ్రిడ్జి వద్ద ప్రమాదాలు జరుగకుండా రక్షణ కంచె లను ఏర్పాటు చేయాలన్నారు.. బాసర నుండి మహోర్ కు జాతీయ రహదారి అనుసంధాన విషయమై కేంద్ర మంత్రిని కోరగా రహదారి సంబందించిన ఫైల్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వద్ద ఉందని త్వరలో నిధులు మంజూరు అవుతాయని కేంద్ర మంత్రి చెప్పినట్లు ఎమ్మెల్యే తెలిపారు.