చిత్రం న్యూస్,బేల: బేల మండల కేంద్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతున్న దృష్ట్యా, బాటసారుల, ప్రజల సౌకర్యార్థం జై హనుమాన్ ఫర్టిలైజర్స్ అధ్వర్యంలో ఇట్టడి సుశాంత్ రెడ్డి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం ఈ కేంద్రాన్ని ప్రారంభించి, వేసవి తాపం నుండి ప్రజలకు ఉపశమనం కలిగించేలా చల్లటి తాగునీటి సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. మండల కేంద్రానికి మార్కెట్ పనుల నిమిత్తం ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు వస్తుంటారని, ఈ ఎండల్లో వారికి దాహార్తి తీర్చాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు సుశాంత్ రెడ్డి తెలిపారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనను స్థానికులు, ప్రయాణికులు అభినందిస్తున్నారు. ఈ చలివేంద్రం ఏర్పాటు పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


