గ్రామ పంచాయతీలకు రూ.247.94 కోట్ల కేంద్ర నిధులు
చిత్రం న్యూస్, డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం రూ.247.94 కోట్ల అదనపు గ్రాంట్లను విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు విడుదలైన ఈ నిధులను గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించనున్నారు. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఆరు రాష్ట్రాలకు రూ.1500 కోట్లకు పైగా గ్రాంట్లను విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు చెందిన పంచాయతీ రాజ్ సంస్థలకు రూ.247.94 కోట్ల అన్ టైడ్ గ్రాంట్స్ కేటాయించబడ్డాయి....