జైనథ్ మార్కెట్ యార్డులో రెండు రోజులు కొనుగోలు బంద్
చిత్రం న్యూస్, జైనథ్: వ్యవసాయ మార్కెట్యార్డు లో శనగ నిల్వలు పెరగడం, వాతావరణం సరిగా లేనందున బుధ, గురు వారాలు రెండు రోజులు కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు రోజులు రైతుల నుండి శనగ కొనుగోళ్లు జరగవన్నారు. శుక్రవారం నుండి గ్రామాల వారీగా యథావిధిగా కొనుగోళ్లు ప్రారంభమవుతాయని, రైతులు ఈ మార్పును గమనించి సహకరించాలని మార్కెట్ సెంటర్ ఇంఛార్జి కోరారు.