జైనథ్ మార్కెట్లో వర్షానికి తడిసిన శనగలు: ఆవేదనలో రైతులు
చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మార్కెట్ యార్డ్లో రాత్రి కురిసిన అకాల వర్షానికి విక్రయానికి తెచ్చిన శనగలు పూర్తిగా తడిసిపోయాయి. మార్కెట్లో తగినన్ని షెడ్లు లేకపోవడమే ఈ నష్టానికి ప్రధాన కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలు కావడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.