ఐపీఎల్ (క్రికెట్) బెట్టింగ్ నిర్వహిస్తున్న 10 మంది వ్యక్తులు అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు
చిత్రం న్యూస్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల పరిధిలో ఐపీఎల్ (క్రికెట్) బెట్టింగ్ నిర్వహిస్తున్న 10 మంది వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్టు ఇచ్చోడ సీఐ బండారి రాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు ఇచ్చోడ మండల పరిధిలోని బృందావన్ కాలనీ ప్రాంతంలో ఎంప్లాయిస్ కాలనీ కి చెందిన గొలుసుల విజయ్ అను వ్యక్తి ఇచ్చోడలోని తన స్నేహితులు దండుగుల మురళి, జాదవ్ రాము,...