Chitram news
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 9:40 pm Editor : Chitram news

ఐపీఎల్ (క్రికెట్) బెట్టింగ్ నిర్వహిస్తున్న 10 మంది వ్యక్తులు అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు 

చిత్రం న్యూస్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల పరిధిలో ఐపీఎల్ (క్రికెట్) బెట్టింగ్ నిర్వహిస్తున్న 10 మంది వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్టు ఇచ్చోడ సీఐ బండారి రాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు ఇచ్చోడ మండల పరిధిలోని బృందావన్ కాలనీ ప్రాంతంలో ఎంప్లాయిస్ కాలనీ కి చెందిన గొలుసుల విజయ్ అను వ్యక్తి ఇచ్చోడలోని తన స్నేహితులు దండుగుల మురళి, జాదవ్ రాము, కాంబ్లే ఆకాష్, సిడాం రవి, కాంబ్లే రాజ్‌కుమార్, కాంబ్లే అరుణ్, దాసన్న దేవాల, కాంబ్లే శశి కుమార్, సీపెల్లి శ్రీనివాస్ అను వ్యక్తులు చిట్టీల రూపంలో IPL బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు, ఇచ్చోడ పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని బెట్టింగ్ నిర్వహిస్తున్న విజయ్ అతనితో పాటు బెట్టింగ్ లో పాల్గొంటున్న వ్యక్తులను పట్టుకొని పంచనామా నిర్వహించామన్నారు.3 మోటార్ సైకిళ్లు, 9 మొబైల్ ఫోన్లు, రూ.4470 నగదు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి వ్యక్తులను రిమాండ్ కు తరలించామని ఆయన పేర్కొన్నారు. దేశంలో IPL(cricket) నడుస్తుందటంతో అమాయకపు ప్రజలను మోసం చేసి ఎలాగైనా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చిట్టీల రూపంలో గాని, ఆన్లైన్ లో గాని, బెట్టింగ్ యాప్స్ రూపంలో గానీ మరి ఏవైనా ఇతర విధంగా బెట్టింగ్ నిర్వహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రాజు హెచ్చరించారు.