లక్షెట్టిపేట–దండేపల్లి ప్రాంతంలో భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం వేడుకలు
చిత్రం న్యూస్, లక్షెట్టిపేట: క్రైస్తవుల పవిత్ర పండుగలలో ముఖ్యమైన మట్టల ఆదివారం (Palm Sunday) వేడుకలు లక్షెట్టిపేట–దండేపల్లి ప్రాంతాలలో ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రాంతంలోని వివిధ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలు నిర్వహించగా విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.మట్టల ఆదివారం సందర్భంగా యేసు క్రీస్తు యెరూషలేములో విజయప్రవేశం చేసిన దినాన్ని స్మరించుకుంటూ విశ్వాసులు చేతుల్లో ఈత కొమ్మలు (మట్టలు) పట్టుకుని ఊరేగింపులు నిర్వహించారు. చర్చిల వద్ద ప్రార్థనలు అనంతరం భక్తులు “హొసన్నా” అంటూ కీర్తనలు పాడుతూ...