చిత్రం న్యూస్, దండేపల్లి: మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట సమీపంలో ఉత్కూర్ చౌరస్తా వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అల్లంపల్లి సంతోష్ తీవ్రంగా గాయపడ్డాడు.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై బాధితుడిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు అతనిని మంచిర్యాలకు తరలించారు. హనుమాన్ మాల దారణలో ఉన్న సంతోష్ తోటి స్వాములతో కలిసి నెన్నెల నుండి కొండగట్టుకు పాదయాత్ర కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.




