Chitram news
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 9:38 pm Editor : Chitram news

గోదావరి పుష్కర ఏర్పాట్లపై ముఖ్యమంత్రితో సమావేశమైన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

చిత్రం న్యూస్, బాసర : ఏప్రిల్ 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే పవర్ రామరావ్ పటేల్ సీఎంతో సమావేశమయ్యారు. గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చర్చించగా ఆ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రూ.100 కోట్ల  నిధులతో బాసర ఆలయ పునర్నిర్మాణం, మాస్టర్ ప్లాన్ అమలు, అదేవిధంగా రూ.200 కోట్ల నిధులతో ముథోల్ లో ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్న సందర్భంగా ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పలు విషయాలు వెల్లడించారు.. శంకుస్థాపన కార్యక్రమానికి మీరు రావడం సంతోషమని, ఆయన ముఖ్యమంత్రికి తెలియజేశారు. గతంలో బాసర అభివృద్ధికి నోచుకోలేదని, మీ హయాంలో ఆలయ పునర్నిర్మాణం జరగడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే చెప్పారు. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయపున నిర్మాణ శంకుస్థాపనకు సీఎం వస్తున్న సందర్భంగా ముధోల్ నియోజక వర్గ ప్రజలతో పాటు భక్తులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.