Chitram news
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 1:11 pm Editor : Chitram news

ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉచితంగా టీటీసీ, పాలిటెక్నిక్ శిక్షణ తరగతులు


చిత్రం న్యూస్,ఆదిలాబాద్:అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆదిలాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఇంటర్, పదవ తరగతి పూర్తయిన విద్యార్థుల కోసం ఉచిత టీటీసీ (TTC),  పాలిటెక్నిక్ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. ఆసక్తిగల విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఏప్రిల్ 1, 2026 నుండి తరగతులు ప్రారంభమం కానున్నాయి.తెలుగు మీడియం (T/M),  ఇంగ్లీష్ మీడియం (E/M) వారికి వేర్వేరుగా తరగతులు నిర్వహించనున్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన,ప్రతి రోజు పరీక్షల నిర్వహణ,విషయాల వారీగా ప్రత్యేక పరీక్షలు, గ్రాండ్ టెస్ట్‌ల నిర్వహణ ఉంటుంది అన్నారు వివరాల కోసం అదిలాబాద్ పట్టణంలోని వినాయక్ చౌక్ శ్రీ సరస్వతి శిశు మందిర్ లో సంప్రదించాలన్నారు.