చిన్నస్వామిలో కోహ్లీ విశ్వరూపం.. ఆరంభ మ్యాచ్లో హైదరాబాద్కు ఘోర పరాజయం
చిత్రం న్యూస్: బెంగళూరు: ఐపీఎల్ 19వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్లోనే ఆర్సీబీ తన ప్రతాపాన్ని చూపించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. స్టాండ్-ఇన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ 38 బంతుల్లో 80 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.చివరలో అనికేత్ వర్మ (18 బంతుల్లో 43)...