ఆదివాసీ మహిళా ఉత్పత్తులను ప్రోత్సహించాలి: జడ్పీ మాజీ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి
చిత్రం న్యూస్,ఆదిలాబాద్:జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఆదిలాబాద్లో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్ ను జడ్పీ మాజీ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మార్ట్లోని వివిధ విభాగాలను కలియతిరిగిన ఆమె, ఆదివాసీ మహిళలు స్వయంగా తయారు చేసిన ఉత్పత్తులను ఆసక్తిగా పరిశీలించారు. ఆదివాసీ మహిళలు పండించిన సేంద్రియ ఆహార పదార్థాలు, పోషక విలువలు కలిగిన చిరుధాన్యాలు మరియు అటవీ ఉత్పత్తుల నాణ్యతను ఆమె అభినందించారు. మహిళలు రూపొందించిన వినూత్న హస్తకళా వస్తువులను...