Chitram news
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 2:23 pm Editor : Chitram news

మంచాల పోతన్న చిత్రపటానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నేత లోక ప్రవీణ్ రెడ్డి 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంచాల పోతన్న పెద్దకర్మ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు లోక ప్రవీణ్ రెడ్డి, డేరా కృష్ణారెడ్డి హాజరయ్యారు. శుక్రవారం ఆదిలాబాద్ రూరల్ మండలం అనుకుంట గ్రామంలోని స్వగృహనికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయనతో అనుబంధంగా ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.