Chitram news
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 11:50 am Editor : Chitram news

ఉచితంగా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

ఉచితంగా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కీర్గుల్ (కె ) గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను అందజేస్తుందని సర్పంచ్ మలేగాం మధు ప్రీతి అన్నారు. శనివారం మండలంలోని కీర్గుల్ కె గ్రామంలో సర్పంచ్, పశువైద్యాధికారి డాక్టర్ రాజేష్, డాక్టర్ వినాయక రావు, డాక్టర్ శివకుమార్ లు పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి పశువులకు వేగంగా వ్యాప్తి జరుగుతుందన్నారు. ప్రతి రైతు తప్పనిసరిగా పశువులకు టీకాలు వేయించాలని సూచించారు. టీకాలు వేయించుకోకపోతే పాల ఉత్పత్తి శాతం తగ్గిపోవడం తో పాటు పశువులు తినలేక బలహీనంగా మారుతాయన్నారు. దీంతో గ్రామంలో సుమారు 200 పైగా పశువులకు వ్యాధి నివారణ టీకాలను వేయడం జరిగిందని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో, ఉప సర్పంచ్ కోప్లే నాగనాథ్, రైతులు, పశు వైద్య సిబ్బంది ఉన్నారు.