చిత్రం న్యూస్, భోరజ్: శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భోరజ్ మండల కేంద్రంలోని శ్రీరామాలయంలో ఆదిలాబాద్ నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి కంది శ్రీనివాస రెడ్డి తరుపున విరాళం అందజేశారు. అనంతరం సంతోష్ రావును గ్రామస్థులు శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో రాజా రెడ్డి, శైలేష్ రెడ్డి, ప్రకాష్, వినోద్, శరత్, సాయి, నారాయణ, మల్లన్న, ప్రశాంత్, దర్శనాల అశోక్, కదరపు దేవిదాస్, అరికిల్ల అరవింద్, పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.



