చిత్రం న్యూస్, భోరజ్: శ్రీరామనవమి సందర్భంగా భోరజ్ మండలంలోని పలు ఆలయాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ దీపక్ రావు, రాష్ట్ర కార్యదర్శి శాంతన్ రావు నాయకులతో కలిసి పూజలు నిర్వహించారు. పెండల్వాడ ఆలయానికి వచ్చిన డీసీసీ వైస్ ప్రెసిడెంట్ దీపక్ రావు ను స్థానిక నేతలు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. స్వామి ప్రతిమను అందజేశారు. వారి వెంట నాయకులు అల్లూరి భూమారెడ్డి, మామిడి మల్లారెడ్డి, దయాకర్ రెడ్డి ఉష్కమ్ శంకర్, ముడుపు ప్రశాంత్ రెడ్డి, శైలేష్ రెడ్డి, రాజారెడ్డి, పొట్ట అశోక్, సంతోష్ రెడ్డి, పూండ్రు రవికిరణ్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.



