* శ్రీ సీతారామ దేవాలయ కమిటీ ఆష్ఠ
చిత్రం న్యూస్, బాసర:నిర్మల్ జిల్లా ముథోల్ మండలం ఆష్ఠ గ్రామంలో శ్రీ సీతారామ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కార్యక్రమానికి సర్వం సిద్ధమైనట్లు ఆలయ కమిటీ తెలియజేశారు. మూడు రోజులపాటు జరిగేటటువంటి ఉత్సవాల్లో పెళ్లి పందిరి పూజ మొదలుకొని అభిషేక అర్చనలు, తలంబ్రాలు, అభిషేకాలు, భజన కీర్తనల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అనంతరం చివరి రోజు అయిన మూడో రోజు మహా అన్నదాన ప్రసాదం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి భక్తులు వస్తున్నట్లు ఆలయ సిబ్బంది పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. భక్తులందరూ ఎక్కువ మొత్తంలో హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాముని సేవకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ వారు కోరారు.





