Chitram news
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 8:05 pm Editor : Chitram news

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని వినతి 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలంలో మొక్క జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంల బాసర తహసీల్దార్ పవన్ చంద్రకు గురువారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ఏర్పాటు చేస్తే రైతులకు మద్దతు ధర లభిస్తుందన్నారు. రైతులు దళారులకు పంటలను అమ్మి మోస పోతున్నారన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. కిసాన్ సంఘ్ అ ధ్యక్షులు బండారి ఆనంద్,  సంఘ్ నేతలు, రైతులు ఉన్నారు.