-Advertisement-

గుంతలమయంగా జాతీయ రహదారి..పట్టించుకోరేం.?

చిత్రం న్యూస్, బాసర:నిర్మల్ జిల్లాలోని బాసర మండలం బిదిరెల్లి గ్రామం నుండి ధర్మాబాద్ వెళ్లి జాతీయ రహదారి రోడ్డు గుంతలమయంగా మారి వాహనదారులకు శాపంగా మారింది. రోడ్డు మధ్య భాగంలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి తెలియని వాహనదారులు గుంతలో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. నిత్యం వాహనదారులు సుమారు వందల వాహనాలు రాకపోకలు కొనసాగుతాయి.  బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శించుకోవడానికి వెళ్లాలంటే నానా అవస్థలు పడాల్సి వస్తుంది. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతు చేయాలని వాహన చోదకులు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments