చిత్రం న్యూస్, కుమురం భీం ఆసిఫాబాద్: పట్టణంలోని జన్కాపూర్ శ్రీ కోదండ రామాలయంలో ఈనెల 27న నిర్వహించనున్న సీతారాముల కల్యాణ మహోత్సవానికి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పరిశీలించారు. ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులతో కలిసి కార్యక్రమ స్థలాన్ని సందర్శించి, జరుగుతున్న ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై కమిటీ సభ్యులతో చర్చించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొండ భారతి,కార్తీక్, వినోద్, నాయకులు జావిద్, తారిక్ బాయ్,ఆసిఫ్, చందు, భీం రావ్, శైలు, సాయి, రాము,తాజ్,తదితరులు పాల్గొన్నారు.




