Chitram news
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 8:17 am Editor : Chitram news

రైతుల సమస్యలు పరిష్కరించండి: కలెక్టర్ రాజర్షి షాకు వినతి

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: జిల్లాలోని రైతులు ఎదుర్కొంటున్న సాగు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జడ్పీ మాజీ చైర్ పర్సన్  చిట్యాల సుహాసిని రెడ్డి జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం సమర్పించారు. ఎకరాకు వస్తున్న 10-12 క్వింటాళ్ల దిగుబడికి అనుగుణంగా, ప్రస్తుతం ఉన్న 7 క్వింటాళ్ల కొనుగోలు పరిమితిని 10 క్వింటాళ్లకు, మార్కెట్‌కు రానున్న జొన్న, మొక్కజొన్న పంటల కోసం ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు బీమా పథకం అమలు చేయాలని, గత ఖరీఫ్ సీజన్ బాకీలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గోదాముల కొరత వల్ల రైతులు పంటను నిల్వ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు.