Chitram news
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 11:17 pm Editor : Chitram news

ఆత్రం సమ్మక్క కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు

చిత్రం న్యూస్, పెంచికల్ పేట్: మండలంలోని కొండపల్లి గ్రామంలో ఇటీవల హత్యకు గురైన ఆత్రం సమ్మక్క కుటుంబాన్ని సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు పరామర్శించారు.ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితులు ఎవరినీ వదిలిపెట్టేది లేదని ఇప్పటికే ఒక వ్యక్తిని రిమాండ్ చేయడం జరిగిందని, ఈ హత్యలో పాత్ర ఉన్నావారందరిని చట్టం ముందు నిలబెడుతామని తెలిపారు. సమ్మక్క కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, వారికి ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేస్తామని తెలిపారు.గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలను పెంచుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కుకిడే రాజేశ్వర్, సర్పంచ్లు అన్నం గణపతి, చప్పిడి రవీందర్, భాజపా నాయకులు ఘనపురం నగేష్, సిరిపురం భీమయ్య, అనంత్ రావు, కారు చంద్రు, రౌతు భుజంగ్ రావు, అలిశెట్టి ప్రసాద్, పళ్లెం పురుషోత్తం, బందరికంటి శేఖర్, ప్రభాకర్, రమేష్, బద్ధి శంకర్ గ్రామస్తులు పాల్గొన్నారు.