Chitram news
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 11:07 pm Editor : Chitram news

శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు

చిత్రం న్యూస్, కాగజ్ నగర్:  పట్టణంలోని బీట్ మార్కెట్లో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో నిర్వహించే శనగల కొనుగోలు కేంద్రాన్ని సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.దహెగాం మండలం కర్జి, గిరివెల్లి ప్రాంతాల్లో దాదాపు వెయ్యి క్వింటాళ్ల శనగల ఉత్పత్తి జరిగిందని, రైతుల ద్వారా తెలుసుకొని తాను మార్క్ ఫెడ్ అధికారులతో మాట్లాడి శనగల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు.శనగలు పండించిన రైతులు ఈ కొనుగోలు కేంద్రాన్ని ఉపయోగించుకుని పూర్తి మద్దతు ధర పొందాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి వెంకటి, మార్కెట్ కమిటి చైర్మన్ సిద్ధల దేవయ్య, జిల్లా మార్కెటింగ్ అధికారి అష్ఫాక్, ఏడిఏ మనోహర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సామ్యూల్, మండల వ్యవసాయ శాఖ అధికారులు ప్రేమలత, కార్తీష, ఏఈఓలు దుర్గా భవానీ, సృజన, శ్రీనివాస్, పీఏసీఎస్ కార్యదర్శి సతీష్ గౌడ్ రైతులు పాల్గొన్నారు.