చిత్రం న్యూస్, బేల:ఎన్జీసీ (NGC) కార్యక్రమంలో భాగంగా బుధవారం సిర్సన్న ఉన్నత పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు స్వయంగా తయారు చేసిన పలు రకాల పోషకాహార వంటకాలను ఇందులో ప్రదర్శించారు.మిల్లెట్స్, పప్పులు, కూరగాయలతో తయారుచేసిన ఆహార పదార్థాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా పేపర్లు,వస్త్రాలతో తయారుచేసిన బ్యాగ్ లను ప్రదర్శించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సైన్స్ అధికారి ఆరె భాస్కర్, మండల విద్యాధికారి మహాలక్ష్మి హాజరై మాట్లాడారు..విద్యార్థులకు సమతుల ఆహారం ప్రాముఖ్యత గురించి వివరించారు.పోషకాహారం ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో, శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు ఎలా లభిస్తాయో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇటువంటి కార్యక్రమాలు పిల్లల్లో మంచి ఆహార అలవాట్లు పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ క్యాతం పొచ్చక్కసురేష్ రెడ్డి సైన్స్ ఉపాధ్యాయులు మమత,అన్విత, ఉపాధ్యాయుల విద్యార్థులు పాల్గొన్నారు



