చిత్రం న్యూస్, ఆదిలాబాద్ రూరల్: ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అర్లి గ్రామ రైతు గణపతి కుటుంబాన్ని జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ సుహాసిని రెడ్డి పరామర్శించారు. బాధిత రైతు నివాసానికి వెళ్లిన ఆమె, కుటుంబ సభ్యులను ఓదార్చి తన సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా సుహాసిని రెడ్డి మాట్లాడుతూ.. అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించి అన్ని విధాలా అండగా నిలవాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆశారెడ్డి, మాజీ ఎంపీటీసీ పోచన్న, వార్డు సభ్యులు విట్టల్, శివయ్య, సతీష్ రెడ్డి, శివకిరణ్ స్థానిక రైతులు, నాయకులు పాల్గొన్నారు.




