-Advertisement-

టీఎన్జీవోస్ జైనథ్ యూనిట్ నూతన కమిటీ ఎన్నిక

చిత్రం న్యూస్, అదిలాబాద్:టీఎన్జీవోస్ జైనథ్ యూనిట్ నూతన కమిటీ ఎన్నికలను మంగళవారం టీఎన్జీవో సంఘ భవనం నందు నిర్వహించారు. ఎన్నికలు అధికారిగా జి. నితిన్ కుమార్ వ్యవహరించారు. ఈ సందర్భంగా జైనథ్యనిట్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కే. శ్రీనివాస్, కార్యదర్శి మమ్మద్ తౌసిఫ్ , ఉపాధ్యక్షులుగా డి. సుధాకర్, ముజీబ్ ఖాన్, తబస్సుం ఫాతిమా, జాయింట్ సెక్రెటరీలుగా బి. సురేందర్, జాదవ్ ఉల్లాస్, సి. జ్యోతి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ పి. ప్రకాష్, పబ్లిక్ సిటీ సెక్రెటరీ డి. ధీరజ్, కోశాధికారి సిహెచ్. చిన్నయ్య, కార్యనిర్వాహక సభ్యులు డి. నర్మద, డి. సాయి ప్రసాద్, కే. సాయి కృష్ణ, ఎస్. సుదర్శన్, ఎం. శ్రీకాంత్ ఎన్నికయ్యారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను శాలువాతో సత్కరించి.. ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా టీఎన్జీవో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.నవీన్ కుమార్ హాజరై నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను అభినందించారు. టీఎన్జీవోస్ యూనియన్ ఏర్పడి 80 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. అప్పటినుండి ఇప్పటివరకు ఉద్యోగుల సమస్యలతో పాటు వారి హక్కుల కోసం పోరాడుతున్నదన్నారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు తోపాటు ఉద్యోగులు సంఘం బలపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తిరుమల్ రెడ్డి, రూరల్ యూనియన్ అధ్యక్షుడు ఏ.ప్రవీణ్ కుమార్, మాజీ టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు సంద అశోక్, ఉద్యోగులు రవికుమార్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments