Chitram news
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 7:46 pm Editor : Chitram news

మ్యాదరిపేటలో ఘనంగా వారసంత వేలంపాట 

చిత్రం న్యూస్, దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మ్యాదరిపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం వారసంత బహిరంగ వేలంపాట కార్యక్రమం సర్పంచ్ చొప్పదండి అనూష అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ వేలంపాటలో గ్రామానికి చెందిన కోటగిరి రామచందర్ రూ.3.36 లక్షలకు పాటను దక్కించుకున్నారు. మొత్తం తొమ్మిది మంది ఔత్సాహికులు ఈ వేలంపాటలో పాల్గొని పోటీ పడ్డారు. చివరికి రామచందర్ అత్యధిక ధర పలికి పాటను స్వాధీనం చేసుకున్నారు.వేలంపాట అనంతరం పాల్గొన్న వారిని గ్రామపంచాయతీ అధికారులు సన్మానించారు. ఈ కార్యక్రమానికి పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రావణ్ కుమార్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.