ఆర్టీసీ సమ్మె సైరన్: రేపు ప్రభుత్వంతో కీలక చర్చలు!
చిత్రం న్యూస్, హైదరాబాద్: తమ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆర్టీసీ జేఏసీ (JAC) సమ్మె నోటీసు ఇచ్చింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం, రేపు హైదరాబాద్లోని అంజయ్య భవన్లో చర్చలకు రావాలని కార్మిక సంఘాల ప్రతినిధులను ఆహ్వానించింది. కార్మికుల ప్రధాన డిమాండ్లు ఇవే: విలీన ప్రక్రియ: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను పూర్తిస్థాయిలో అమలు చేయాలి. వేతన సవరణ: 2021 మరియు 2025కు సంబంధించిన పెండింగ్ జీతభత్యాల (PRC)...