Chitram news
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 7:38 pm Editor : Chitram news

ఆర్టీసీ సమ్మె సైరన్: రేపు ప్రభుత్వంతో కీలక చర్చలు!

చిత్రం న్యూస్, హైదరాబాద్: తమ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆర్టీసీ జేఏసీ (JAC) సమ్మె నోటీసు ఇచ్చింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం, రేపు హైదరాబాద్‌లోని అంజయ్య భవన్‌లో చర్చలకు రావాలని కార్మిక సంఘాల ప్రతినిధులను ఆహ్వానించింది.

కార్మికుల ప్రధాన డిమాండ్లు ఇవే:

విలీన ప్రక్రియ: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను పూర్తిస్థాయిలో అమలు చేయాలి.

వేతన సవరణ: 2021 మరియు 2025కు సంబంధించిన పెండింగ్ జీతభత్యాల (PRC) సవరణ చేపట్టాలి.

యూనియన్ల పునరుద్ధరణ: సంస్థలో కార్మిక యూనియన్లకు తిరిగి అనుమతినివ్వాలి.

ఉద్యోగ భద్రత: డ్రైవర్లు, కండక్టర్ల ఉద్యోగ భద్రతపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలి.

బకాయిల విడుదల: కార్మికులకు రావాల్సిన పాత బకాయిలను వెంటనే చెల్లించాలి.

రేపు జరిగే చర్చల్లో ప్రభుత్వం ఇచ్చే హామీలపైనే సమ్మె భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒకవేళ చర్చలు విఫలమైతే, 26వ తేదీ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా బస్సులు రోడ్డెక్కే అవకాశం లేదని తెలుస్తోంది.ఈ చర్చల అనంతరం జేఏసీ తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తుందా లేదా ప్రభుత్వం సమ్మెను నివారిస్తుందో చూడాలి.