Chitram news
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 7:30 pm Editor : Chitram news

జైనథ్ లో ఈనెల 25 నుండి శనగ కొనుగోళ్లు ప్రారంభం 

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని రైతుల సౌకర్యార్థం 2025-26 సంవత్సరానికి గాను శనగ పంట కొనుగోలు షెడ్యూల్‌ను మండల వ్యవసాయ అధికారి పూజ విడుదల చేశారు. ఈ ప్రణాళిక ప్రకారం మార్చి 25వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు వివిధ గ్రామాల నుండి కొనుగోళ్లు జరగనున్నాయి. రైతులు తమ పంటను షెడ్యూల్ చేసిన తేదీలలో కొనుగోలు కేంద్రనికి తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.