Chitram news
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 7:26 pm Editor : Chitram news

బోరంచును మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి షేక్ ఇమామ్ 

చిత్రం న్యూస్, మావల: ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ లో జిల్లా సెక్రటరీగా నియమితులైన షేక్ఇమామ్ మావలలో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా  శ్రీకాంత్ రెడ్డి షేక్ ఇమామ్ ను శాలువాతో సన్మానించి అభినందించారు.రానున్న రోజుల్లో మరింత కష్టపడి పనిచేసి మరిన్ని పదవులు పొందాలని ఆకాంక్షించారు. అలాగే ప్రజా ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసి రైతుల కళ్ళలో సంతోషాలు నింపిందని, ఇందిరమ్మ ఇళ్ల తో పేదలకు సొంతింటి కలను సాకారం చేసిందని ఇలాంటి మరెన్నో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి నిరంతరం తమకు ఇచ్చిన పదవికి న్యాయం చేకూర్చేలా పార్టీ పటిష్టతకు  కృషి చేయాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు అంతా కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ AMC వైస్ చైర్మన్ శేషరావు, సిరికొండ సర్పంచ్ బొడ్డు దత్తు, సుంకిడి సర్పంచ్ రాథోడ్ గణపతి, సిరికొండ ఉప సర్పంచ్ తోకల రాజు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ ఇమామ్, RGPRS అధ్యక్షులు సదానందం,మాజీ సర్పంచ్ షేక్ బషీర్, ఈశ్వర్, సందీప్, రామారావు, అలాం,సీనియర్ నాయకులు శేబ్బీర్, అజగర్, లాస్స్మన్న, కంచం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.