Chitram news
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 5:07 pm Editor : Chitram news

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం 

చిత్రం న్యూస్, బాసర: రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా నిధులను విడుదల చేసి, అన్నదాతలకు అండగా నిలిచిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి నాయకులు ఘనంగా క్షీరాభిషేకం నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో నిర్వహించిన ఈద్ మిలాద్-ఉన్-నబి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, బాసర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామ్మయి రమేష్, ఇతర ముఖ్య నాయకులకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మామ్మయి రమేష్ మాట్లాడుతూ. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా నిధులు విడుదల చేయడం రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి పాలనకు నిదర్శనం అని కొనియాడారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.