నిరంతరాయంగా ‘కంది’ నిత్యాన్నదానం: పేదల ఆకలి తీరుస్తున్న ప్రజాసేవా భవన్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్ డెస్క్: ఆకలితో అలమటించే నిరుపేదల కడుపు నింపడమే పరమావధిగా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిత్యాన్నదాన కార్యక్రమం జిల్లాలో ఒక మహోద్యమంలా సాగుతోంది. పేద రైతు కుటుంబంలో పుట్టి, అమెరికాలో స్థిరపడి, మాతృభూమిపై ప్రేమతో తిరిగి వచ్చిన ఆయన.. తన సేవా గుణంతో వేలాది మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మూడేళ్లుగా నిర్విరామంగా.. ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం 'ప్రజాసేవా భవన్'...