చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలోని రేణుకాపూర్ హనుమాన్ ఆలయ పునః నిర్మాణం,ఆలయ అభివృద్ధి కోసం నూతన కమిటీని వీడీసీ గౌరవ అధ్యక్షులు తీగల వెంకటేష్ గౌడ్, అధ్యక్షులు నూకం లింగారావు,గ్రామ పెద్దలు, కమిటీ సభ్యుల అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రేణుకాపూర్ ఆలయ నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్, అధ్యక్షులుగా సంజీవరావు దేశ్ముఖ్, ఉపాధ్యక్షులుగా గురు స్వామి శ్రీనివాస్, పద్మారావు, క్యాషియర్ ప్యాట్ల సుకేష్ రావు, కొక్కుల గంగాధర్, సెక్రెటరీ పుట్నాల సాయినాథ్ పటేల్, రాజు పట్వారి, పీఆర్ఓ భీమ్ రావు ను అందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. త్వరలోనే ప్రభుత్వ సహకారంతో పాటు గ్రామస్తుల సహాయ సహకారాలతో ఆలయ అభివృద్ధి పనులు చేపడతామన్నారు.




