చిత్రం న్యూస్, ఆసిఫాబాద్: జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ కుమార్ను ఆయన కార్యాలయంలో డీసీసీ అధ్యక్షురాలు అత్రం సుగుణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి పలు ప్రజాసంబంధిత అంశాలపై చర్చించారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను అటవీ శాఖ పరిధిలోని వాగుల నుంచి తీసుకుపోవడానికి కొంత సడలింపు కల్పించాలని కోరారు. పేదల గృహ నిర్మాణానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అటవీ శాఖ సహకారం అవసరమని పేర్కొన్నారు.అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీలు అటవీ ఉత్పత్తుల సేకరణలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోడు భూములకు అటవీ హక్కు పత్రాలు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. మారుమూల గిరిజన గూడాలకు రహదారి సదుపాయాలు కల్పించేందుకు అటవీ శాఖ సహకారం అందించాలని కోరారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిర బాయి, సుజాయిత్ ఖాన్, కొట్నాక్ గణపతి, రాంచందర్, జగన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.


