చిత్రం న్యూస్,ఆదిలాబాద్: గ్రామాల్లో అభివృద్ధి లక్ష్యంగా పలువురు సర్పంచులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో బూర్నూర్, లోహార, లింగుగూడ గ్రామ పంచాయతీల సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచులు ఆత్రం గంగారాం, వసంత్ రావు, మానిక్ రావులకు కంది శ్రీనివాస రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామ పంచాయతీల ప్రగతి కోసం సర్పంచులు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభపరిణామమని పేర్కొన్నారు. సర్పంచులందరూ గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. అందరం కలిసికట్టుగా పల్లెలను అభివృద్ధి పథంలో నడిపిద్దామని ఆయన పిలుపునిచ్చారు.
<img class="aligncenter wp-image-5557 size-full"src=https://chitramnews.com/wp-content/uploads/2026/03/3958e92009bc40ddb4a9035dd59af409-3.jpg alt="" width="914" height="733" /


